Monday, June 30, 2025

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి-గద్వాల ఆర్టీఏ నరసింహ స్వామి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని, నిబంధనలు పాటించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉంటుందని గద్వాల ఆర్టీఏ నరసింహ స్వామి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఏ నరసింహ స్వామి మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని అన్నారు. జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అనేక ప్రమాదాల నుంచి ఇది మనలను రక్షిస్తుందని తెలిపారు. అలాగే కారు నడిపే వారు, ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని, మొబైల్‌ మాట్లాడుతూ వాహనం నడుపరాదని, అలాగే మద్యం సేవించి వాహనం నడుపరాదని తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరి సరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలని ప్రయాణికులకు సూచించారు. గమ్యస్థానానికి చేరవేసే ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేట్‌ రవాణా వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని తెలిపారు. వాహనదారులు రహదారులలో విధించిన వేగ పరిమితిని మించి అతివేగంగా ప్రయాణం చేయరాదని, తప్పనిసరిగా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని, కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ వద్ద జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద జాగ్రత్త వహించాలని, వాహనాన్ని ఎడమ వైపు, కుడి వైపు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా వాహనం ఇండికేటర్లు ఉపయోగించాలని, అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular