జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.యం. సంతోష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశం హాలు నందు సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి ప్రజావాణి ద్వారా వచ్చే పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 28ఫిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై12, ఆసరా పింఛన్లకు 3, ఇతర సమస్యలకు సంబంధించి13 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులకు హెచ్-సెక్షన్లో రశీదు ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. కౌంటర్ పెట్టి రిపోర్ట్ తీసుకోవాలన్నారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు.
తదనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని, ప్రోటోకాల్, మంచినీరు, స్నాక్స్, ఫ్లవర్ డేకరేషన్, ఆరోగ్య, ఫైర్, స్టాల్స్, ఆయా శాఖల అధికారులు మొదలైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు, ఆర్డిఓ చంద్రకళ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ బీ.యం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES