Monday, June 30, 2025

ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలి-జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, ఆడపిల్లలను రక్షించడం, ఉన్నత చదువులు చదివించడం వలన సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశం హాలు నందు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల సంరక్షణ కోసం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం వంటి సమస్యలపై అవగాహన కల్పించడం జరగుతుందన్నారు. అనంతరం ఆడపిల్లలు సమాజానికి మణిహారం అని, అలాంటి ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేద్దాం, వారికి స్వేచ్ఛాయుతమైన వాతావరణం, పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుదాం, ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం18సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మనవంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం అని కలెక్టర్ అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ముషాయిదా బేగం, డిఎంహెచ్ఓ శశికళ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular