Monday, June 30, 2025

పార్లమెంట్ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి-జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, పార్లమెంట్ -2024 ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్ అధికారుల పాత్ర అతి ముఖ్యమైనదని, ఎన్నికల విధులను ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అలాగే ఈవిఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశం హాలు నందు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు-2024 గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన సెక్టోరియల్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని, సెక్టార్ అధికారి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈవీఎం, వివి ప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకుని ఉండాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చే సిబ్బందికి ఎన్నికల రోజున తగు సూచనలు అందించాలని తెలిపారు. ఎన్నికల ముందురోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు, ఎన్నికల రోజున తమకు కేటాయించిన రూట్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే శిక్షకులచే నివృత్తి చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు.
శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల పట్ల ప్రిసైడింగ్ అధికారులుగా విధులు నిర్వహించే వారికి అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. పోలింగ్ సందర్భంగా ప్రతి పిఓ తీసుకోవాల్సిన మెటీరియల్, ఈవీఎంల నిర్వహణ, ఓటరు జాబితా మార్కుడ్ కాపీ, పిఓ,ఏపిఓ డైరీ, వారి విధులు, పోలింగ్ కేంద్రం బయట తీసుకోవలసిన సామాగ్రి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వారు, మాక్ పోల్, ఈవీఎం ,వివి ఫ్యాట్లను ఎలా అనుసంధానం చేయాలి అన్న విషయాలు ఒకటికి రెండుసార్లు చదివి తెలుసుకోవాలని, పిపిటి ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిసి సుబ్రహ్మణ్యం, అలంపూర్ ఎన్నికల నోడల్ అధికారి, ఆర్డిఓ చంద్రకళ, అన్ని మండలాల తాహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఎన్నికల విభాగం అధికారులు కరుణాకర్, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular