Monday, June 30, 2025

సామాజిక చైతన్యాన్ని కలిగించిన కవి వేమన-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, సమాజంలో నెలకొన్న మూఢచారాలు, కులమతాల బేధాలను తన పద్య, గద్యాల ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యాన్ని రగిలించినది, నేటికీ ఉపయోగించబడుతున్నది వేమన శతకంలోని పద్యాలు, గద్యాలు, కవితలేనని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో యోగి వేమన జయంతి సందర్భంగా పెద్ద తండా సర్పంచు తాన్యానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగి వేమన జీవిత పరమార్ధం కోసం తన జీవితాన్నే గురువుగా ఎంచుకొని జీవితంలోని నగ్నసత్యాలను మింగుడు పడనంత కఠినంగాను సులభంగా జీర్ణం అయ్యేంత లలితంగా హాస్యం, వ్యంగ్యం, హేతువాదంతో కూడిన బోధనలు చేసి ప్రజాకవిగా కీర్తించబడ్డారన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను వేమన ఆనాడే తన పద్య, గద్యాల ద్వారా ఎలుగెత్తి చాటారని, ఆయన పద్యాలలోని నీతి వ్యాఖ్యలు నేటి సమాజానికి మేలుకొల్పు వంటివని అన్నారు. అనంతరం వేమన గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఉప సర్పంచు మల్దకల్, మల్దకల్ మాజీ ఎంపిటిసి రాముడు, పెదొడ్డి సర్పంచు రఘుపతి, మాజీ ఎంపీపీ గోవింద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరవాయి కృష్ణారెడ్డి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, పెదొడ్డి రామకృష్ణ, సద్దలోనిపల్లి గోపాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular