Monday, June 30, 2025

జిల్లాలో ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ బీ.యం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో మంజూరైన ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బి, పంచాయితి రాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు ఆర్అండ్బి, పంచాయితి రాజ్ ఇంజినీరింగ్ ఈఈ, డిఇలతో, టిఎస్ఎంఐడిసి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులను పనుల పురోగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన ఇంజినీరింగ్ పనులు ఎన్ని, ఎన్ని పూర్తి అయ్యాయని,ఎన్ని పెండింగులో ఉన్నాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన పనులన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రోగ్రెస్ ఉన్న పనులను ఫైనల్ చేయాలన్నారు. అలాగే గ్రామాలలోని సీసీరోడ్లు, కాలువల పనులపై పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ కు అధికారులు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో మంజూరైన పనులను ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బి ఇఇ ప్రగతి, పిఆర్ఇఇ ఆంజనేయులు రహీమ్, శ్రీనివాసులు, రాజేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular