జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల పట్టణంలోని జమ్మిచేడులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత మూడు రోజులుగా జరుగుతున్న జేపీఎల్ ప్రీమియర్ లీగ్ పోటీలు మంగళవారం ముగిసాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనగా, చివరి రోజు జరిగిన పోటీల్లో రాకేష్ జట్టు మొదటి బహుమతి, బుజ్జి జట్టు రెండో బహుమతి, శరత్ జట్టు మూడవ బహుమతి గెలుపొందాయి. ఈ పోటీలకు స్వాన్సర్ అయిన వాల్మీకి రాము, నాగరాజు, సురేష్ లు విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్. ఇమ్మానియేల్, జయరాం, వెంకట్, రవి, ఆనంద్, అద్దాల నాగరాజు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జమ్మిచేడు ప్రీమియర్ లీగ్ పోటీలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES