జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలో సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా మెలిగి వారికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ని జిల్లా ఎస్పీ రితిరాజ్ సందర్శించి స్టేషన్లోని రికార్డులను, స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్హెచ్వో, మెన్ రెస్ట్ రూమ్, లాకప్ గదులను పరిశీలించారు. అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూములో రికార్డులు భద్రపరచుట, 5ఎస్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు 5ఎస్ ను సక్రమంగా అమలయ్యేటట్లు చూసుకోవాలని, స్టాఫ్ కు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే మహిళ అధికారులకు రెస్ట్ రూమ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏయే విధులు నిర్వహిస్తున్నారని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుంచి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఎన్ని బీట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రతిరోజు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ 24గంటలు గస్తీ నిర్వహించాలని, రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్, పాత నేరస్థులపై నిఘా పెట్టాలని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి, అధికారులకు సూచించారు. ముఖ్యంగా గంజాయి,గుట్కా, గుడుంబా సరఫరా, గ్యాంబ్లింగ్ పై నిఘా ఉంచాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదుదారులకు రీసిప్ట్ ఇవ్వాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ పై అందరు అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటు వారి సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, సిబ్బంది అందరు బాధ్యతయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల సిఐ. శ్రీనివాస్, పట్టణ ఎస్ఐలు శ్రీకాంత్, షుకూర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి బాధితునికి న్యాయం జరిగేలా చూడాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్-గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES