Tuesday, July 1, 2025

పేకాట స్థావరంపై పోలీసుల దాడి-రూ. 4లక్షల 8వేల నగదు,17ద్విచక్ర వాహనాలు,1-కారు,19ఫోన్లు స్వాధీనం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జాంపల్లి గ్రామ శివారులో భారీ మొత్తంలో పేకాట శిబిరం నిర్వహిస్తుండగా పక్కా సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశానుసారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 18మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 4లక్షల 8వేల నగదు,17 బైకులు, 1-కారు,19 మొబైల్స్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రోత్సహించరాదని, ఇలాంటి ఎవరైనా చేస్తే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular