జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని మాంటిస్సోరి ట్రెడిషన్స్ హైస్కూల్ నందు గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. రవిప్రకాష్ రెడ్డి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులు సాంస్కృతిక వేషధారణలతో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గాలిపటాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి. రవిప్రకాష్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ సుమ బిందు, పి. నిరంజన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మాంటిస్సోరి ట్రెడిషన్స్ హైస్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES