జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన బీఎం. సంతోష్ ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం ఆమె కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కలెక్టరేటుకు చేరుకొని కలెక్టర్ సంతోష్ ని ఆయన చాంబర్లో కలిసి పూల మొక్క అందజేశారు. అలాగే శాలూవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ని కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES