జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మూడవ వార్డు హమాలీ కాలనీలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమావాస్య సందర్బంగా వార్డు కౌన్సిలర్ దంపతులు గీతమ్మ, నాగులు యాదవ్ ఆధర్వంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్మన్ బిఎస్. కేశవ్ ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ దంపతులు చైర్మన్, కౌన్సిలర్, ఎంపీపీ, జడ్పీటీసీలకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ టీ.శ్రీను, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, కేటీ దొడ్డి జడ్పీటీసీ రాజశేఖర్, మాజీ సర్పంచు మైలగడ్డ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, బి.చిన్న, బి.వీరేష్, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ ఓరుగల్లు నేషనల్ టీవీ
RELATED ARTICLES