జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఖరీఫ్, రబీకి సంబంధించిన కష్టమ్స్ మిల్లింగ్ రైస్(బియ్యం)ను ఈ నెల 20వరకు రైస్ మిల్లర్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్సు హాలు నందు జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి ఆయా మిల్లర్లు బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇచ్చే సిఎంఆర్ బియ్యాన్ని100శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. ప్రతిరోజు మిల్లింగ్ కెపాసిటిని బట్టి రైస్ ను100శాతం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతిరోజు మిల్లుకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి రోజువారి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో రైస్ మిల్లును రివ్యూ నిర్వహించి వారికి కేటాయించిన బియ్యం, ఉన్న బ్యాలెన్స్ ను మిల్లు సామర్థ్యాన్ని బట్టి10రోజులలో ఖరీఫ్, రబీ ధాన్యాన్ని పూర్తి చేసి ప్రభుత్వానికి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా బియ్యం అందించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, డిఎం విమల, కనకయ్య, మంగమ్మ, రైస్ మిల్లర్ల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కష్టమ్స్ మిల్లింగ్ బియ్యాన్ని 20లోపు పూర్తి చేయాలి-రైస్ మిల్లర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES