జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో వాహనదారులకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించగా, ఈ అవకాశం బుధవారంతో ముగియనుందని, వాహనదారులు ఇంకా చలాన్లు చెల్లించని వారు ఉంటే వెంటనే చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి10వరకు రాయితీ అవకాశం కల్పిస్తూ ద్విచక్ర వాహనాలకు 80శాతం, ఆటోలు, ఫోర్ వీలర్లకు 60శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90శాతం చొప్పున రాయితీలు ప్రకటించిందని తెలిపారు. అలాగే భారీ వాహనాలకు కూడా 50శాతం రాయితీ ఇచ్చిందని, వాహనదారులు తమ వాహనాలపై పడిన చలాన్లను నిర్ణీత వ్యవధిలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అయితే ఈ అవకాశం డిసెంబర్ 25లోపు వాహనాలపై పడ్డ చలాన్లకే రాయితీ వర్తిస్తుందని, ఆ తరువాత పడ్డ చలాన్లకు వర్తించదని తెలిపారు. ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని అన్నారు.
వాహనదారులకు నేటితో ముగియనున్న రాయితీ అవకాశం-చలాన్లు పడ్డ వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి-గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES