జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఎం. సంతోష్ ని జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కలెక్టర్ కి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానూకూలంగా స్పందించారు. కలెక్టర్ ని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు రామన్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్, గౌడంపల్లి నాగరాజు, మల్లిఖార్జున్ గౌడ్, రాఘవ గౌడ్, రజినీకాంత్, సుగంధర్ నాథ్ తదితరులు ఉన్నారు.
జిల్లా కలెక్టర్ సంతోష్ ని కలిసిన జర్నలిస్టులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES