Monday, June 30, 2025

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలు వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజావాణికి వస్తుంటారని, వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల వారిగా వచ్చే ప్రధాన సమస్యల దరఖాస్తులను తగ్గించాలని అధికారులకు ఆదేశించారు. ధరణి సమస్యలపై, భూ సంబంధిత సమస్యలపై, విద్య శాఖ 8, వికలాంగులు, వితంతువులు 3, వృద్ధాప్య పింఛన్ల 6, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం165 ఫిర్యాదులు అందాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు నిశితంగా పరిశీలన చేసి వాటిని వారంలోపు పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులందరు ఉదయం 10.30గంటలకు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular