జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం, ముచ్చొని పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాముడుని శాలూవాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాముడన్న సైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి విరాళం ఇచ్చిన సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES