జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంట్రీ (డిజిటలైజేషన్) చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి సమావేశం హాలు నందు ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ విధి విధానాలపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనర్లచే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రజల నుంచి స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను తప్పులు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులలో ప్రజలు తెలిపిన సమాచారానే కంప్యూటర్లో నమోదు చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటి పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా, ప్రతి లబ్దిదారుడు లబ్ది పొందేలా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, మహలక్ష్మి, చేయూత పథకాలను చివరి వ్యక్తి వరకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డేటా నమోదు సరిగా చేయనిచో ఆరు గ్యారంటీల పథకాలు లబ్దిదారులకు అందవని, దరఖాస్తుదారుల సీరియల్ నెంబర్, యునిక్ ఐడిని ఆప్లికేషన్లో రాసి ఎక్సెల్ షీట్లో పొందుపరచాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, పూర్తి వివరాలు సరిగ్గా నమోదు చేయాలన్నారు. ఇందుకుగానూ 350మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లాలో ఉన్నారని, ఒక్కరోజుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎన్ని దరఖాస్తులు డిజిటలైజేషన్ చేయగలరో అట్టి సమాచారం తెలియజేయాలన్నారు. డేటా నమోదు వివరాలను ఆన్ లైన్లో డిజిటలైజేషన్ సమయంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఎంపీడీవోలు, ఎంపీఓలకు సూచించారు. ప్రతి ఒక దరఖాస్తుకు మొబైల్ ఓ.టి.పి వస్తుందని, మాస్టర్ ట్రైనర్లచే వాట్సప్ గ్రూపు చేసుకొని ఏవైనా సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులు సమర్పించే దరఖాస్తులలో ఏ కాలమ్స్ ఎంచుకున్నారో ఆ కాలాన్ని సరిగ్గా నమోదు చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటిని డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు1.5లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డిజిటలైజేషన్ చేసిన దరఖాస్తులన్నింటిని 17వ తేది తర్వాత సంబంధిత శాఖల ద్వారా క్షేత్ర పరిశీలన చేయాలని అన్నారు. నిర్దేశిత గడువు లోపు దరఖాస్తు వివరాల నమోదు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు, జెడ్పి సిఈఓ కాంతమ్మ, మాస్టర్ ట్రైనర్ రమేష్, మండల అధికారులు, డిపిఓ శ్యాంసుందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్లో నమోదు చేయాలి-జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఓరుగల్లు రుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES