జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో వాహనదారులు ఎవరైనా సరే మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అయ్యే అవకాశం ఉందని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్ అన్నారు. జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన 28మందికి శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ కౌన్సిలింగ్ కార్యాలయంలో జిల్లా ఎస్పి రితిరాజ్ ఆదేశానుసారం ఎస్ఐ విజయ భాస్కర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదాలు జరిగితే మీపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పాలవుతాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాలసి వస్తుందని ఆయన తెలిపారు. కోర్టులో ప్రతి కేసు నమోదవుతుందని, జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోతాయని, విద్యార్థులు, యువకులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఈ కేసులు అడ్డొస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా తాము క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా తమతో సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు చేస్తాం-ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఓ ఓరుగల్లు రుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES