జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీలోని 24 వ వార్డులో బస్తి దవాఖాన నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించి సీరియల్ నెంబర్ ప్రకారంగా దరఖాస్తులను పరిశీలించుకోవాలని అన్నారు. 24వ వార్డులో ఎంత జనాభా ఉంది, ఎన్ని కౌంటర్లు పెట్టారని, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను మున్సిపల్ కమిషనర్ ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్యమంత్రి సందేశం ప్రజలకు చదివి వినిపిస్తున్నారా అని అడిగారు. దరఖాస్తు ఫారానికి దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు జత చేసి అట్టి ఫారాన్ని కేటాయించబడిన కౌంటర్లలో తీసుకోవాలని, ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి తీసుకునే దరఖాస్తులను, రిజిస్టర్లో నమోదు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు దరఖాస్తులు అందుబాటులో ఉంచారా, దరఖాస్తులు స్వీకరించిన అనంతరం రశీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వార్డులో 600 కుటుంబాలకుగానూ 500 దరఖాస్తులు వచినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 90శాతం దరఖాస్తుల స్వీకరణ జరిగిందన్నారు. అలాగే కలెక్టర్ ప్రజాపాలన కార్యక్రమం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు, ఆర్డిఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ నరసింహ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్ ఓరుగల్లు 9నేషనల్ టీవీ
RELATED ARTICLES