Monday, June 30, 2025

అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం-హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో కలువైన సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సంతాన వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్త డాక్టర్ సుహాసిని రెడ్డి, విక్రమ్ సింహా రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు కన్నుల పండుగగా జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular