జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, మల్దకల్ మండలంలోని పెద్ద తాండ గ్రామంలో మంగళవారం గ్రామ జాతరను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను సర్పంచు తాన్యా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ క్రీడాకారులు ఆటలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు హనుమంతు, సేవలాల్ సేన ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్, బాలు, పాపారాయుడు, నర్సింహ నాయక్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు రమేష్, తిమ్మప్ప, తాన్య, ముని, సిద్దు, శీను, రవి, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలను ప్రారంభించిన గ్రామ సర్పంచు తాన్యా నాయక్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES