Monday, June 30, 2025

తాగి వెహికల్​ నడిపితే రూ. 10 వేల ఫైన్-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్ర వాప్తంగా జరిగే న్యూఇయర్​సెలబ్రేషన్స్, ఈవెంట్స్‌‌పై పోలీసులు స్పెషల్​ఫోకస్​పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌‌ డ్రైవ్, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ టెస్ట్‌‌లు నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలను సీజ్​చేయడంతోపాటు ఆల్కహాల్​కంటెంట్ ను బట్టి కేసు నమోదు చేసి, రూ.10 వేలు, ఆరు నెలల జైలు శిక్ష పడేలా కొరడా ఝుళిపించనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌‌పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పోలీస్‌‌స్టేషన్స్‌‌ పరిధిలో చెక్‌‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్‌‌‌‌ టెస్ట్‌‌లు తప్పనిసరి చేయాలని ఆదేశించింది.

న్యూ ఇయర్​వెంట్స్‌‌కు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే.. కేసులు నమోదు చేస్తారు. ప్రతి పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో 5 చెక్‌‌పాయింట్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్‌‌ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్‌‌ డిటెక్షన్స్‌‌ను టెస్ట్‌‌లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో(టీ న్యాబ్‌‌) ఇప్పటికే120 డ్రగ్ డిటెక్షన్​ పరికరాలను కొనుగోలు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular