ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్ర వాప్తంగా జరిగే న్యూఇయర్సెలబ్రేషన్స్, ఈవెంట్స్పై పోలీసులు స్పెషల్ఫోకస్పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లు నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలను సీజ్చేయడంతోపాటు ఆల్కహాల్కంటెంట్ ను బట్టి కేసు నమోదు చేసి, రూ.10 వేలు, ఆరు నెలల జైలు శిక్ష పడేలా కొరడా ఝుళిపించనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్స్టేషన్స్ పరిధిలో చెక్పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
న్యూ ఇయర్వెంట్స్కు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే.. కేసులు నమోదు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్పాయింట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంకెన్డ్రైవ్తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్స్ను టెస్ట్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) ఇప్పటికే120 డ్రగ్ డిటెక్షన్ పరికరాలను కొనుగోలు చేసింది.