Monday, June 30, 2025

బండలాగుడు పోటీలపై నేతల బల ప్రదర్శన-పోటీలకు అనుమతులు లేవంటూ జాతరలో144సెక్షన్ అమలుకు ఎస్పీ ఆదేశం-ససేమిరా అంటూ పోటీలను ప్రారంభించిన రైతులు-అడ్డుకున్న పోలీసులు…స్టేషన్ కి ఎద్దులు తరలింపు-144సెక్షన్ ఎత్తివేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు, రైతులు-మూడు గంటలపాటు రాకపోకలకు అంతరాయం-ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, భక్తులు-మల్దకల్ మండల కేంద్రంలో టెన్షన్…టెన్షన్ ఓరుగల్లు 9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం అట్టహాసంగా నిర్వహించే రైతు సంబరాల నిర్వహణలో ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మల్దకల్ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న రైతు సంబంధించి ఈ సారి ఎలాంటి అనుమతులు లేవంటూ జిల్లా ఎస్పీ మల్దకల్ జాతరలో 144 సెక్షన్ అమలుకు ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు, రైతులు రైతు సంబరాలకు సంబంధించి ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని, ఎప్పటిలాగే ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహించ తలపెట్టడంతో గురువారం మల్దకల్ మండల కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు బండలాగుడు పోటీలను ప్రారంభించిన తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకుని పోటీలను అడ్డుకుని పోటీలో పాల్గొన్న ఎద్దులను మల్దకల్ పోలీసు స్టేషన్ కి తరలించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు, రైతులు గద్వాల-అయిజ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతు సంబరాలకు విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో మలక్దల్ మండల కేంద్రంలో కిలో మీటర్ మేర రహదారికి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఏమి జరుగుతుందో అంటూ అటు వాహనదారులు, ఇటు భక్తులు ఆందోళనకు గురయ్యారు. మల్దకల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించే బండలాగుడు పోటీలను జిల్లా అధికారులు నిషేధించడంతో ఉదయం నుంచే ఆ ప్రాంతంలో పోలీసులు మొహరించి రైతు సంబరాలను తిలకించడానికి విచ్చేసిన వారిని అక్కడి నుంచి వెల్లగొట్టారు. ఈ క్రమంలో ఓ రైతుపై పోలీసులు అకారణంగా దాడికి దిగ్గడంతో బాధిత రైతుకు గాయాలైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడి చేరుకుని ఆందోళనకు‌ దిగారు. ఓ పక్క ధర్నా, మరో పక్క బండలాగుడు పోటీలను ప్రారంభించారు. దీంతో పోలీసులు బండలాగుడు పోటీలను నిలిపివేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే బండలాగుడు ప్రదర్శన పోటీలను పోలీసులు ఎందుకు నిషేధించారంటూ వారు పోలీసులను నిలదీశారు. బండలాగుడు ప్రదర్శనలపై ఎవరో ఫిర్యాదు చేస్తే నిలిపివేస్తారా, గతంలో బీఆర్ఎస్ నాయకులు బండలాగుడు పోటీలను నిర్వహించినప్పుడు మీకు నిబంధనలు గుర్తుకు రాలేదా అని పోలీసుల తీరుపై మండిపడారు. అనాధిగా వస్తున్న బ్రహ్మోత్సావాలలో ఎన్నడు లేని విధంగా144 సెక్షన్ విధించడంతోపాటు బండలాగుడు పోటీలపై నిషేదించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా కారణంగా దాదాపు రెండు గంటలపాటు రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలగడంతో అటు అయిజ, గద్వాలకు వెళ్లే ప్రయాణికులు, జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా మల్దకల్ లో నిర్వహించే బండలాగుడు పోటీలను నిషేధించాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర జంతు పరిరక్షణ అధికారులకు, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు పోటీలను నిర్వహించకుండా ఎన్నడు లేని విధంగా 144సెక్షన్ అమలు చేశారని పోటీలకు వచ్చిన రైతులు, తిలకించేందుకు వచ్చిన ప్రజలు ఆరోపించారు. అందుకు గురువారం సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ద్వారా చేసిన ఓ ఫిర్యాదు వైరల్ కావడం కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. అయితే గత ఏడాది మల్దకల్ జాతరలో, ఇటీవల పాగుంట జాతరలో నిర్వహించిన రైతు సంబరాలను దగ్గరుండి ప్రారంభించి ఎద్దుల బండ లాగుడు పోటీలను నిర్వహించినప్పుడు ఈ ఎమ్మెల్యేకు, జిల్లా అధికారులకు జంతు పరిరక్షణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయ పంతాలకు పోయి అనాధిగా వస్తున్న రైతు సంబరాలపై కుట్రలు చేయడం సమంజసం కాదని ప్రజలు, రైతులు అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular