Monday, June 30, 2025

యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలి-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, ప్రపంచ శాంతి కోసం యేసుక్రీస్తు చేసిన బోధనలు, సందేశాలను ప్రతి ఒక్కరు అనుసరించి పాటించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జి సరిత అన్నారు. సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని పలు చర్చిలతోపాటు మండలంలోని బీరెల్లీ గ్రామంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హాజరై ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలలో ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా అందజేసిన నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం సరిత మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. క్రిస్మస్‌ పండుగ నాడు సమస్త మానవాళి యేసు క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, దయ గుణాలపై ప్రేరణ పొంది ఆచరించాలని సూచించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని, జిల్లాలోని క్రైస్తవులు కూడా పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఆమె క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు గంజిపేట శంకర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జమ్మిచేడు ఆనంద్, మాజీ సర్పంచు జయన్న, అజయ్, ఏఫోన్, దేవన్న, మోహన్, వెంకటేష్, తిమ్మారెడ్డి, రవీందర్ రెడ్డి, బ్రహ్మేశ్వర్ రెడ్డి, మహిమూద్, ఇలియాస్, గంజిపేట రాము, మోహన్ యాదవ్, కురుమన్న, పరుశ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular