Monday, June 30, 2025

మల్దకల్ తిమ్మప్పకు పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు-కన్నుల పండుగగా స్వామివారి కల్యాణోత్సవం ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, మల్దకల్ మండలం కేంద్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి) బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి, కృష్ణమోహన్ రెడ్డిలు స్వామివారికి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు వారికి ఆలయ ఈవో, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొంది కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. స్వామివారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలు కలిగి అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి విజయ్, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి దంపతులు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న, ఆలయ ఛైర్మన్ ప్రహల్లాద రావు, జిల్లా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచు యాకోబు, కౌన్సిలర్ నాగిరెడ్డి, ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, రాజు, సత్యం రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, చక్రం రెడ్డి, శేషంపల్లి నర్సింహులు, అజయ్, నరసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్, మధు నాయకి, ఆంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, రాముడు, భాస్కర్ గౌడ్, పరశురాముడు, ప్రవీణ్, తిమ్మరాజు, బద్రి, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular