జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఈ నెల 26నుంచి జనవరి 10వరకు ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించిందని, ద్విచక్ర వాహనాలకు 80శాతం, ఆటోలు, ఫోర్ వీలర్లకు 60శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90శాతం చొప్పున రాయితీలు ఇచ్చిందని తెలిపారు. అలాగే భారీ వాహనాలపై 50శాతం ప్రకటించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 2కోట్ల పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత నెలాఖరు నాటికి పెండింగ్ చలాన్ల సంఖ్య మళ్లీ రూ. 2కోట్లకు చేరుకోవడంతో మరోమారు రాయితీ ప్రకటించారని, నిర్ణీత వ్యవధిలో ఈ చలాన్లను చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఎవరు కూడా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడపరాదని, అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి
తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకోవాలని కోరారు.
పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్-వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి-గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES