Monday, June 30, 2025

వినియోగదారులు ప్రతి వస్తువుకు రశీదు తీసుకోవాలి-జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో వినియోగదారులు తాము కొన్న ప్రతి వస్తువుకి సంబంధించి అమ్మకపుదారుల నుంచి రశీదును తప్పనిసరి పొందాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీర్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జిల్లా పౌర సరపరాల శాఖ, కామర్స్ డిపార్ట్ మెంట్, ఆస్రా కన్జుమర్ కేర్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బ్యాంకు వివరాలు, ఓటిపి వివరాలు ఎవరికీ
చెప్పవద్దని, ఆన్లైన్ షాపింగ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రకటనలకు ఆకర్షితులై మోసపోవద్దని తెలిపారు. కొన్న వస్తువులో నాణ్యత లేకుంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చని, మొబైల్లో వచ్చే మోసపూరితమైన మనిలోన్ యాప్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ-కామర్స్, డిజిటల్ వర్తక దశకంలో వినియోగదారుల రక్షణ (ఎలక్ట్రానిక్ కామర్స్) అనే ఎలక్ట్రానిక్ నెట్వర్క్, ప్రధానంగా జరిగే ఇంటర్నెట్ ద్వారా వస్తువుల కొనుగోలు, సేవ, అమ్మకాలు నిధుల డేటా ప్రసారం చేయడం జరుగుతుందని, వీటిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆస్రా గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఈ-కామర్స్, డిజిటల్ వర్తక దశకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ రేవతి, డిఎం. మంజుల, ఆస్రా అధ్యక్షుడు భరత్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీపతినాయుడు, కామర్స్ డిపార్ట్మెంట్ నర్సింహులు, మహేష్, ఈశ్వర్, సంబంధిత అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular