జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలపై వచ్చే ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మొత్తం 85ఫిర్యాదులను సమర్పించారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా ధరణికి సంబంధించిన భూ సమస్యలపై 57, ఆసరా పెన్షన్ల కోసం 8, ఇతర సమస్యలకు సంబంధించి 20 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించి సంబంధిత మండల తహసీల్దార్లతో మాట్లాడి ఆన్లైన్ రికార్డులో పరిశీలించి, క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఇతర ఫిర్యాదులను కూడా పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. అలాగే భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపుర్వ్ చౌహాన్, రెవెన్యూ కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES