Monday, June 30, 2025

సీఎం సహాయనిధికి రిటైర్డ్ ఉద్యోగి విరాళం అందజేత-అభినందించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం, వడ్డేపల్లి మండలంలోని కోయిల్ దిన్నె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు జి. కాంతారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ ఆర్థిక సహాయంకు సంబంధించిన డిమాండ్ డ్రాప్ట్ ని ఆయన కలెక్టర్ వల్లూరు క్రాంతికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తనకు వచ్చే ఆదాయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. అలాగే కాంతారెడ్డికి కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular