జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన12ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. పోలీసులు ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు ఇతరుల చేత ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. కార్యాలయానికి వచ్చిన12 ఫిర్యాదులలో భూ వివాదాలకు సంబంధించి రెండు, గొడవలపై రెండు,
చీటింగ్ పై రెండు, ఒకటి భర్త వేదింపులకు సంబందించి, ఒకటి దొంగతనం, ఇతర అంశాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కృషి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES