జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒకటవ తారీఖున పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగుల సంఘం కార్యదర్శి చక్రధర్ అన్నారు. ఆదివారం పెన్షనర్స్ డే సందర్భంగా గద్వాల పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో రిటైర్డ్ ఉద్యోగుల సభ్యుల సమావేశం నిర్వహించి పెన్షనర్ ఉద్యమ పితామహుడు డిఎస్ నకార చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఐటీ నుండి రిలాక్సేషన్ కల్పించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డులు వర్తింపజేయాలన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన పదిమంది రిటైర్డ్ ఉద్యోగులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బీసి రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు, పండరినాథ్, కృష్ణారెడ్డి, వెంకటరమణ, వసంతరాయుడు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు ఒకటవ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES