Monday, June 30, 2025

రోడ్డు భద్రత, ట్రాపిక్ నియమాలు, సైబర్ నేరాలపై అవగాహన ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణం, దౌదర్ పల్లి నందు ఎస్సై సుకూర్ అధ్వర్యంలో షి టీమ్, పోలీస్ కళాబృందం వారు ప్రజలకు, యువకులకు రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, షీ టీమ్స్ గురించి, డయల్-100 ప్రాముఖ్యత గురించి, బాధిత మహిళలకు బరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించీ, పోలీస్ చట్టాల గురించి, CEIR వినియోగం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రహదారులపై వాహనదారులు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సైన్ బోర్డ్ ను గమనిస్తూ వెళ్ళాలని అన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని, మనం బయటకు వెళ్ళినప్పుడు మనకోసం మన భార్య, పిల్లలు ఎదురు చుస్తుంటారనే విషయాన్ని గమనించాలని అన్నారు. వాహనదారులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు పరిమిత వేగంలో వెళ్లాలని, ద్విచక్ర వాహనదారుడు ఎల్మెంట్ ధరించాలని, కార్లలో ప్రయనిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. రహదారిపైకి వెళ్ళే సమయంలో, జాతీయ రహదారి క్రాస్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఉచితలకు మోసపోవద్దని, ఈ మెయిల్ లేదా మెసేజ్ లో సామాజిక మాధ్యమాల్లో ప్రకటన కనిపించిన జాగ్రత్త పడండని, బ్యాంకులో ఇటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగిస్తారని గుర్తించాలని అన్నారు. PAN కార్డును అప్డేట్ చేసుకోవడం కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి లాంటి మెసేజ్ లకు ఎవరు కూడా స్పందించవద్దని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్ గూగుల్ లో వెతకవద్దు, మీకు లాటరీలు తగిలినాయి, మీకు లోన్స్ ఇస్తామని, తక్కువ ధరకే ఆన్లైన్ లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతాయని కాబట్టి అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ వచ్చినప్పుడు వారి నుండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా బాధితులు సైబర్ నేరం నకు గురైన వెంటనే 1930కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే పోలీసు వారి డయల్ 100కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని ఎవరైనా గుట్కాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలపాలని, బాల్య వివాహాలు చేయడo వల్ల మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, జరిగే నష్టాల గురించి కళాకారులు పాట రూపంలో తెలియజేశారు. ఎవరైన మొబైల్స్ ను పోగొట్టుకున్నప్పుడు CEIR అప్లికేషన్ సద్వినియోగం గురించీ తెలియజేసారు. షీ టీం సభ్యులు మాట్లాడుతూ ఎవరైనా మహిళలు, విద్యార్థినీలు వేధింపులకు గురైతే పోలీస్ షీ టీం నెం 8712670312కు ఫోన్ కాల్ లేదా వాట్సప్ మెస్సేజ్ ద్వారా సమాచారం అందిస్తే వేధింపులకు గురి చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యoగా ఉంచుతామని అన్నారు. మైనర్ బాలికలను లైంగికంగా వేదిస్తే పోక్సో కేసులు నమోదు, తరువాత నిందితులకు జరిగే దుష్పలితాల గురించీ, బాధిత మహిళలకు బరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పోకడలపై పాటల రూపంలో మాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానస్టేబుల్ రాదమ్మ, షి టీమ్, కళా బృందo సభ్యులు, హన్మంతు, కృష్ణ, రామాంజనేయులు, బరోసా సిబ్బంది పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular