జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గం, గట్టు మండలంలోని అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి హాజరై వాల్మీకి మహర్షి విగ్రహానికి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ప్రజలు వాల్మీకి సోదరులు ఎమ్మెల్యే సతీమణికి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సతీమణికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పిటిసి బాసు శ్యామల, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతునాయుడు, సర్పంచు ఆంజనేయులు గౌడ్, ఉపసర్పంచు తిక్కయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముని, చంద్ర గౌడ్, వీరేష్ స్వామి, దానప్ప, విరుపాక్షి రెడ్డి, నీలకంఠరెడ్డి, వేమారెడ్డి, రామిరెడ్డి, లింగన్న, నరసింహ, వెంకటేష్, ఆంజనేయులు, రామాంజనేయులు, గుండ్ల ఆంజనేయులు, పుల్లయ్య, గుడిసె నరసింహులు, శివప్ప, గురన్న, నాగరాజు, వీరేషు, బడే సాహేబ్, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES