జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గం, గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ముంపునకు గురైన బాధితులకు కేటాయించిన పునరావాస కేంద్రాన్ని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరిత శనివారం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడి కేంద్రంలోని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్నిరోజుల క్రితం ఆర్అండ్ఆర్ సెంటర్లో కేటాయించిన ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం జరుపుకుంటున్న గ్రామస్తులపై విద్యుత్ అధికారులు కేసులు నమోదు చేసినట్లు నిర్వాసితులు జెడ్పి చైర్ పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆమె విద్యుత్ అధికారులతో చరవాణిలో మాట్లాడి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సరిత సూచించారు. నిర్వాసితులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల రాజశేఖరరెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్ బాబు, గట్టు కృష్ణ, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, రామలింగేశ్వర కాంళ్లే, అంతంపల్లి ఆంజనేయులు, రామకృష్ణ, నరసింహులు, దానయ్య, భాస్కర్ రెడ్డి, తిమ్మప్ప, ఓంకార్, ప్రకాశ్ గౌడ్, బల్గేర బజారన్న, ముక్కేరన్న, తుమ్మలపల్లి రవినాయుడు, ఆంజనేయులు, మాచర్ల ప్రకాష్, ఆలూర్ రవి, ఆరగిద్ద బాలకృష్ణ, గురుపద, రమేష్, రాజేష్, సురేష్, బత్తలయ్య, శేఖర్ గౌడ్, వెంకటేష్, ఇసాక్, తిరుమల్, రామకృష్ణ, అల్వాల రాజశేఖరరెడ్డి, సద్దలోనిపల్లి గోపాల్, కరాటే సత్యం,నరేందర్ రెడ్డి, రామకృష్ణ, సోమశేఖర రెడ్డి,కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి,బంగీ నవీన్,తదితరులు ఉన్నారు.
చిన్నోనిపల్లి పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జెడ్పి చైర్పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES