Monday, June 30, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పెంచాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం 100కి పెంచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలోని గురుకుల, మైనార్టీ, సాంఘీక సంక్షేమ, విద్యా శాఖ అధికారులతో విద్యపై వార్షిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యూ డైస్ ప్లస్ లో ప్రతి విద్యార్థి ప్రొఫైల్ తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఆధార్ లేని విద్యార్థులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. ఆధార్ లేని విద్యార్థుల చదువు బ్రేకప్ కాకుండా చూడాలన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు టీసీ, బోనఫైడ్ ఇచ్చే విషయంలో ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని డీఈఓకు ఆదేశించారు. జిల్లాలో విద్యార్థులు బడి బయట తిరగకుండా పాఠశాలలో చేరే విధంగా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత, రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలో అందించాలన్నారు. విద్యార్థులందరికీ ఫెస్ రికగ్నైజ్ సిస్టమ్ లో నమోదై ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశలో జిల్లా విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి ముషాయిదా బేగం, బీసీ సాంఘీక సంక్షేమ శాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిని, మైనార్టీ రెసిడెన్షియల్ అధికారి, ఎంఈఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular