Monday, June 30, 2025

మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఘన స్వాగతం-గజమాలతో సత్కరించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావు మొదటిసారిగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జీ సరిత గద్వాల మండలంలోని అనంతపురం స్టేజి వద్ద మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మంత్రికి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మంత్రిని ఊరేగింపుతో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular