జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసిలో మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావుని మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి జూపల్లిని సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES