జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రజల అభివృద్ధిలో పారదర్శకంగా ప్రజా ఆకాంక్షలకనుగుణంగా జిల్లా అధికారులందరు సమిష్టి బాధ్యత వహించి పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశం హాలు నందు అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పారదర్శకంగా, అవినీత లేకుండా మంచి పరిపాలన అందించాలని అన్నారు. రైతులకు, మహిళలకు సంబంధించి ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారులు పనిచేయాలన్నారు. ఎక్కువగా ధరణి సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మంత్రి ధాన్యం సేకరణ గురించి ఆరా తీశారు. జూరాల, నెట్టెంపాడు, ర్యాలంపాడు, ఆర్డీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతవరకు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించారు. టూరిజం, మున్సిపల్, ఆర్అండ్బీ, పంచాయితీ రాజ్ అధికారులను శాఖల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గద్వాల జూరాల టూరిజంలో 75శాతం పనులు పూర్తయ్యాయని, ఇక అలంపూర్లో జోగుళాంబ ఆలయంలో ప్రసాద్ పథకం పనులు 70శాతం పూర్తయినట్టు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ గురించి మంత్రి ఆరా తీయగా జిల్లాలో గద్వాల, అలంపూర్లలోని100పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అదే విధంగా అబ్కారీ శాఖపై మంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, ఎమెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, అదనపు కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, జిల్లా అదనపు ఎస్పీ ఎన్ రవి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభివృద్దిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పారదర్శకంగా పని చేయాలి-రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES