జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ జిల్లా అదనపు ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, చీటింగ్ పై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి పోలీస్ అధికారులను ఆదేశించారు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES