Sunday, June 29, 2025

జిల్లాలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాను తయారు చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మండల తహసిల్దార్లకు ఆదేశించారు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సోమవారం సాయంత్రం కాన్ఫరెన్సు హాలు లో అన్ని మండలాల తహసిల్దర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఓటరు జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని, తొలగించిన ఓటర్ల వివరాలు సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి, డూబ్లికేట్ ఓటర్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని, 2024, జనవరి 1వ తేదీని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా సవరింపులో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై పక్క ప్రణాళికతో ఉండాలని ఆదేశించారు.ఓటర్లు 1450 కంటే ఎక్కువ ఉంటే అట్టి పోలింగ్ స్టేషన్ ల వివరాలు సమర్పించాలని అన్నారు. మీ సేవలో కుల, ఆదాయ సర్టిఫికేట్ లు పెండింగ్ లో ఉన్నవాటిని త్వరగాపూర్తి చేయాలనీ ఆదేశించారు. మీ మండలాలో ధరణికి సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ తహసిల్దార్లకు ఆదేశించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రినివాష్, ఆర్ డి ఓ చంద్రకళ, అన్ని మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular