జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్ పల్లి సమీపంలో నిర్మిస్తున్న 300 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగినది. ఈ సందర్బంగా పనుల పురోగతిపై కాంట్రాక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో రూ. 39 కోట్లతో గద్వాల ప్రాంతంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి పనులు సుమారు 90% పూర్తి కావడం జరిగిందని, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా సహకారంతో వచ్చే ఏడాది మార్చి వరకు మిగిలిన పనులను పూర్తి చేసి గద్వాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్,వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ దౌలు,నరహరి శ్రీనివాసులు నాగిరెడ్డి, శ్రీను, నరహరి గౌడు, కృష్ణ,గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు , ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు,కోటేష్, నాగులు యాదవ్,సతీష్, రిజ్వాన్, కురుమన్న, బంగి సుదర్శన్,మోబీన్, గంజి పేట రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES