Sunday, June 29, 2025

వైభవంగా వెంకన్న స్వామికి అభిషేకంనిర్వహించిన మున్సిపల్ చైర్మన్ దంపతులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ దంపతులు బిఎస్. కళావతి, కేశవ్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మేళతాళాలు, భజాభజంత్రీల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా చైర్మన్ దంపతుల చేతుల మీదుగా స్వామివారికి స్నపన తిరుమంజనం, అభిషేకం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా జరిపించారు. అనంతరం స్వామివారి కళ్యాణం, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ పూజా కార్యక్రమాలకు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులు, నాయకులు, గోవిందా స్వాములు, అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular