Sunday, June 29, 2025

ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మీ పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను జిల్లా ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, జిల్లా ఎస్పీ రితిరాజ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 5లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యం పొందేవారని, నేటి నుంచి ప్రవేశ పెడుతున్న ఆరోగ్య శ్రీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల నుంచి10లక్షల వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1,60,066 ఆహార భద్రత కార్డుదారులకు,1672 (సర్జికల్, మెడికల్) ప్యాకేజీలు రాజీవ్ గాంధీ పథకం కింద వర్తిస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందేలా కృషి చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఈ పథకం వలన సాధారణ వైద్యంతోపాటు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గద్వాలలో శుభకర, స్రవంతి ఆసుపత్రి నందు రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ క్రింద వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారని, వయస్సుతో భేదం లేకుండా ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచనంగా ప్రారంభిస్తున్నందున కరపత్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా ఎస్పి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఆవిష్కరించారు. అనంతరం మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా ఎస్పి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, డి.ఎం.ఎచ్.ఓ శశికళ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్, ఆర్టీసీ డిపో మేనేజర్ మంజుల, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, బాలికలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular