జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్టింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా చేసే అవకాశం రెండుసార్లు వచ్చినా వద్దనుకుని మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. ప్రతి పేదవాడు మూడు పూటల భోజనం చేయాలని, వందరోజుల పనికి ఆహార పథకం తీసుకొచ్చిన తల్లి, ప్రశ్నించేతత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం తెచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి, 60ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ అని పేర్కొన్నారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలు ఉచిత వైద్యం పొందేందుకు ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ. 10లక్షలకు పెంచి శనివారం నుంచే అమలు చేయడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్, సీనియర్ కౌన్సిలర్ గంజిపేట శంకర్, నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ బాబు, అమరవాయి కృష్ణారెడ్డి, ఎం.ఎ.ఇషాక్, నల్లారెడ్డి, మోహన్ రావు, రామలింగేశ్వర కాంళ్లే, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, యూసుఫ్, బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి సంజీవులు, డిటిడిసి నర్సింహులు, నాగేంద్రయాదవ్, ఎల్లప్ప, భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి, షఫీవుల్లా, మాల శ్రీనివాసులు, జగదీష్, జమ్మిచేడు సురేష్, ఆనంద్, తిమోతి, రాము, ధరూర్ శ్రీకాంత్ రెడ్డి, పూడూర్ ఈశ్వర్, బోయ శ్రీను, తాన్యనాయక్, నాగ శంకర్, జయక్రిష్ణ, మనోజ్, రామకృష్ణ, మహిమూద్, భాస్కర్ రెడ్డి, సత్యరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు-సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES