జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారుల సమాచారం, ఫోన్ నంబర్లు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే బోర్డులో ఉన్న అధికారులను సంప్రదించేందుకు ఫోన్ చేస్తే వారు ఇక్కడి నుంచి బదిలీ అయి ఏళ్ళు గడుస్తున్నట్లు సమాధానం వస్తుండడంతో విస్తూపోవడం ప్రజల వంతు అవుతుంది. నిత్యం కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఆ బోర్డులను గమనించారా లేక చూసినా ఆ బోర్డుతో మనకేం పని ఉందని వదిలేస్తున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖలో రైతులకు అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలోని నల్లకుంట కాలనీలో ఉన్న జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లిన వారికి ఈ సంఘటన ఎదురుకావడంతో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం లోపల అధికారులు ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం బోర్డులో పొందుపరిచిన అధికారులను సంప్రదించేందుకు ఫోన్ చేయగా ఓ అధికారి తాను గద్వాల నుంచి బదిలీ మూడేళ్లు కావస్తున్నదని, అయిన ప్రతిరోజు ఎవరో ఒకరు అక్కడి నుంచి తనకు ఫోన్ చేస్తున్నారని వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోయారు. దీంతో ప్రస్తుత అధికారి ఎవరో తెలుసుకునేందుకు కార్యక్రమంలో సంప్రదించాల్సి వస్తుందని, ఈ మాత్రం దానికి సమాచార హాక్కు బోర్డులు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం బోర్డులో పని చేయని అధికారుల పేర్లు తొలగించి ప్రస్తుతం పనిచేస్తున్న వారి సమాచారం ఏర్పాటు చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
అధికారి మారినా…బోర్డుపై పేరు మారదు..!-చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES