జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీర్ల శ్రీనివాసులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ముఖ్య అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించారని అభినందించారు. అలాగే వివిధ జిల్లాల్లో ఎంతమేరకు ఈవీఎమ్, వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరం పడుతాయో తెలియజేయాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ నిర్వహణ ధృవపత్రం, సీ కేటగిరీ మెటీరియల్స్, రీకౌన్షిలేషన్ రిపోర్ట్, ఎఫ్ఎల్ సీ(ఫస్ట్ లెవల్ చెకింగ్)లపై జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మిగిలి ఉన్న ఈవీఎమ్స్, వీవీప్యాట్ల వివరాలు అందజేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగిన అన్ని వివరాలను టెక్నికల్ బృందం, సీ సెక్షన్ అధికారులు త్వరలో అందజేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విధంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అంతా సిద్దంగా ఉంటామని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో చైతన్య, భరత్, తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి-రాష్ట్ర ముఖ్య అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES