జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డిసెంబర్ 6న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, నాయకులు సీనియర్ కౌన్సిలర్ గంజిపేట శంకర్, మాజీ మార్కెట్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, గద్వాల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇషాక్, కౌన్సిలర్ శారద, మాజీ కౌన్సిలర్లు తుమ్మల నరసింహ, నాగేందర్ యాదవ్, ఎలప్ప, తిమ్మన్న, పులిపాటి వెంకటేష్, మాజీ సర్పంచు పూడూర్ ఈశ్వర్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ షేక్ జమాల్, గద్వాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి నందు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు కిఫాయత్, ఇమ్మానియేల్, ఆనంద్ గౌడ్, తిమోతి, ఇలియాస్, థరూర్ రవి, ఆనంద్, పెద్దపల్లి రాజశేఖరరెడ్డి, గంజిపేట రాము, జాంగీర్, ముక్రం, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, కృష్ణయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటన్న, కరాటే సత్యం, మాల శ్రీనివాసులు, పెదొడ్డి రామకృష్ణ, బోయ శ్రీను, కృష్ణమూర్తి, కుంట రవి, నవీన్, సామి తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తా-కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES