Sunday, June 29, 2025

పోలీస్ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పెంచాలి-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలో నమోదవుతున్న వివిధ కేసులలో నేరస్తులకు శిక్షలు పడటం ద్వారానే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, అందుకు అదనపు పీపీలు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాలు నందు మొదటి ఏడీజె కోర్టు అదనపు పిపి త్రిపాఠి, గద్వాల పొక్సో కోర్టు అదనపు పీ.పీ ఆనంద్ కుమార్, అడిషనల్ సెషన్స్ కోర్ట్ అదనపు పిపీలు యుగేందర్, లక్ష్మణ్, కోర్టు డ్యూటీ అధికారులతో ఆయా కేసులలో నేరస్తులకు శిక్షల శాతం పెంచేందుకు తీసుకునే చర్యలలో భాగంగా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పొక్సో, గ్రేవ్ కేసులలో ఎక్కువ శాతం శిక్షలు పడకపోవడానికి గల కారణాలను ఏపీపీలను, అదనపు ప్రాసిక్యూటర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ కోర్టు డ్యూటీ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ పొక్సో కేసులలో నేరస్తులకు తప్పనిసరిగా శిక్షలు పడాలని, అందుకోసం కేసు నమోదు అయిన మొదటి రోజు నుంచి ఓ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే సమయానికి కోర్టుకు పంపాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఆయా కేసులలో సాక్షులను సరైన విధానంలో ఎంపిక చేసుకోవడంపై, కేసుల విచారణలో పాటించాల్సిన నియమాలపై, చార్జీ షీట్ నమోదు చేసి ఫైల్ చేయడంపై, ప్రాపర్టీని, సాక్షులను కోర్టు సమయానికి ప్రవేశపెట్టడంపై కోర్టు డ్యూటీ అధికారులకు పలు సూచనలు చేశారు. నమోదైన కేసులలో తప్పనిసరిగా శిక్షలు పడాలని అందుకు సాక్షులను,బాధితులను తరచుగా విచారిస్తూ వారికి దైర్యం ఇవ్వాలని సూచించారు. కోర్టు అధికారులు, ప్రజలు ఎప్పటికప్పుడు న్యాయవాదులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ శివకుమార్, కోర్టు లైసన్ ఎస్సై రమా దేవి, కోర్టు లైసన్ అధికారులు, ఎస్సై రషీద్, పరమేష్, నరసింహులు, సాయిబాబా, చంద్రశేఖర్, కోర్టు డ్యూటీ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular