Sunday, June 29, 2025

ఓట్ల లెక్కింపులో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా లెక్కింపు మైక్రో అబ్జర్వర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు లెక్కింపు కేంద్రంలో జాగ్రత్తగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం ఐడిఓసి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన మెక్రొ అబ్జర్వర్లు, తహసీల్దార్లు, కౌంటింగ్ సూపర్వైజర్, లెక్కింపు రోజు చేపట్టే విధివిధానాలపై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ఏ చిన్న పొరపాటు జరగకుండా మెక్రొ అబ్జర్వర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్ విధులు నిర్వహించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ టీం వారిగా చేయాల్సి ఉంటుందని, ఆర్ఓల దగ్గర ఆర్డర్ కాపీ, గుర్తింపు కార్డు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ రోజున ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ చేయాలని, తదుపరి 8:30గంటలకు ఈ.వి.ఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపుని ప్రారంభించాలని తెలిపారు. ప్రతి రౌండ్ కు రిసల్ట్ షీట్లో రాసి, ఫలితాలు ఇవ్వాలని అన్నారు. లెక్కింపు సూపర్వైజర్లు కంట్రోల్ యూనిట్ ఆయా పోలింగ్ స్టేషన్కు సంబంధించినదా కాదా అని సరి చూసుకోవాలని. ప్రతి టేబుల్ కు ముగ్గురు సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ ఏజంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి, కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం-17సి నందు నమోదైన ఓట్లు సరిచూసుకోవాలని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గద్వాల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహాన్, అలంపూర్ రిటర్నింగ్ అధికారి చంద్రకళ, రెవెన్యూ కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, సిపిఓ సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular